గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం వందలాది మంది నిరుద్యోగులు రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఇటీవలె నిర్వహించిన నియామకాల పరీక్షను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ప్రభుత్వం స్పందిస్తూ వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపింది. కష్టపడిన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చేస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ హామీ ఇచ్చారు.
పరీక్షల్లో మాస్ కాపీ, పేపర్ లీక్ వంటి ఆరోపణలపై మా ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసినవారు కచ్చితంగా ఉద్యోగాలకు అనర్హులు. వారికి ఉద్యోగాలు రాకుండా చూస్తాము. కష్టపడిన ప్రతిఒక్కరికీ తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తాము.
-విజయ్ రుపానీ, గుజరాత్ ముఖ్యమంత్రి