తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లింట వరుడు సహా 14 మందికి కరోనా

పెళ్లయిన వారానికే వరుడితో పాటు.. అదే కుటుంబానికి చెందిన 13 మందికి కరోనా సోకిన ఘటన రాజస్థాన్​ భీల్​వాడాలో జరిగింది. వివాహ వేడుకలో భౌతిక దూరం నిబంధనలు సరిగా పాటించకపోవడమే కారణంగా తెలుస్తోంది.

By

Published : Jun 23, 2020, 5:02 PM IST

Updated : Jun 23, 2020, 5:15 PM IST

Groom, family members test positive for coronavirus after wedding
పెళ్లింట వరుడు సహా 14 మందికి కరోనా

రాజస్థాన్​ భీల్​వాడాలో కరోనా కలకలం రేపింది. భడదా భాగ్​లో పెళ్లయిన వారానికే వరుడు సహా.. అతడి కుటుంబంలోని మరో 13 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. పెళ్లింట్లో ఒకేసారి ఇంతమందికి వైరస్​ సోకడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది.

అప్రమత్తమైన అధికారులు.. వారందరినీ క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించారు. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

ఎక్కువ మంది గుమికూడటం వల్లే..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ వేడుకల్లో 50 మంది కంటే ఎక్కువగా హజరుకాకూడదంటూ నిబంధనలను జారీ చేసింది రాజస్థాన్​ సర్కార్​. కానీ వాటిని ఉల్లంఘిస్తూ.. ఈ పెళ్లికి 60 మంది కంటే ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు.

ఇదీ చూడండి:ఇసుకలో పూరీ జగన్నాథుడి రథయాత్ర!

Last Updated : Jun 23, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details