కరోనా కాలంలో రైతులకు తక్షణ ఉపశమనం కలిగించే నిర్ణయాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 3 కీలక సంస్కరణలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
నిత్యావసర చట్టంలో మార్పులు..
కొరత అధికంగా ఉన్న సమయంలో 'నిత్యావసర వస్తువుల చట్టం- 1955'ను రూపొందించారని చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు మెరుగైన మద్దతు ధర అందించేందుకు చట్టానికి సవరణ చేస్తామని స్పష్టం చేశారు.
- భారీగా పెట్టుబడులను ఆకర్షించి.. వ్యవసాయ రంగంలో పోటీతత్వాన్ని పెంచే ప్రయత్నం.
- తృణ ధాన్యాలు, వంటనూనెలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఉల్లి, బంగాళదుంప వంటి వాటిని చట్ట పరిధి నుంచి తొలగింపు.
- అరుదైన, విపత్కర పరిస్థితుల్లో మినహా ఆహార శుద్ధి పరిశ్రమలకు సరకు నిల్వ పరిమితి నుంచి మినహాయింపులు.
ఎక్కడైనా అమ్ముకోవచ్చు..