తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జల్​​ జీవన్​కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు' - pm

ప్రతి ఇంటికి మంచినీరు, శౌచాలయం కల్పించి మహిళల ఇబ్బందులు తగ్గిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దివంగత సోషలిస్టు నాయకులు రామ్‌మనోహర్ లోహియా కల ఇదేనని మోదీ పేర్కొన్నారు. జల్​ జీవన్​ మిషన్​కు వచ్చే 5 ఏళ్లలో సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : Sep 7, 2019, 9:02 PM IST

Updated : Sep 29, 2019, 7:54 PM IST

వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. జల్‌జీవన్ పథకం ద్వారా 2024 లోగా లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. మహారాష్ట్ర పర్యటనలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన ఔరంగాబాద్​ బహిరంగ సభలో ప్రసంగించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"జల్​ జీవన్​ మిషన్​ను ప్రారంభించాం. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. సోషలిస్టు నేత రామ్​మనోహర్​ లోహియా 1970లోనే చెప్పారు. మహిళలకు ఉన్న ప్రధాన రెండు సమస్యలు.. శౌచాలయం, ఇంటిని నడిపేందుకు నీరు. ఈ రెండింటినీ పరిష్కరిస్తే దేశ సమస్యలకు మహిళలే సమాధానమిస్తారు. లోహియా వెళ్లిపోయారు. ఎన్నో ప్రభుత్వాలు, నేతలు వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు మేం దీన్ని మార్చబోతున్నాం. ఇక ప్రతి ఇంటిలో శౌచాలయం ఉంటుంది. నీళ్లూ ఉంటాయి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

హరిత స్మార్ట్​ సిటీ ప్రారంభం

దిల్లీ-ముంబయి వాణిజ్య కారిడార్​లో భాగంగా దేశంలోని మొదటి హరిత స్మార్ట్​ సిటీ 'ఆరిక్​'కు ప్రారంభించారు మోదీ. ఇక్కడి పనులు పూర్తయ్యేలోపు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అభిప్రాయపడ్డారు ప్రధాని.

ఇదీ చూడండి: 'చంద్రయాన స్వప్నం నెరవేరడం ఖాయం'

Last Updated : Sep 29, 2019, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details