తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు! - Shashi Tharoor of the Congress

పార్లమెంటరీ సంయుక్త కమిటీకి వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లును పంపాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లుపై విపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు!
సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు!

By

Published : Dec 11, 2019, 2:49 PM IST

వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లును పార్లమెంటరీ సంయుక్త కమిటీకి పంపాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వ్యక్తిగత గోప్యత పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చిచెప్పింది.

ఈ ఒక్క బిల్లు కోసమే ఏర్పాటయ్యే పార్లమెంటరీ కమిటీ రాబోయే బడ్జెట్ సమావేశాలలోగా నివేదిక సమర్పిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్​ ప్రసాద్​ లోక్​సభలో తెలిపారు. ఆ తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని స్పష్టంచేశారు.

ఐటీ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్​ సభ్యుడు శిశి థరూర్​ కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ బిల్లును తన కమిటీ ముందుకే పంపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'పౌర' బిల్లుపై భారతీయ ముస్లింలకు షా భరోసా

ABOUT THE AUTHOR

...view details