దేశంలో గ్రామీణ పారిశుద్ధ్య ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా 'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' సర్వేను ప్రారంభించింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 700 జిల్లాలు, 17,475 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే చేయనున్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ దిల్లీలో ఈ సర్వేను ప్రారంభించారు. ప్రజలు తమ స్పందన తెలియజేసేందుకు ఓ యాప్ను ఆవిష్కరించారు.