తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వచ్ఛతలో మీ పల్లెకు ఎంత స్కోర్​ ఇస్తారు? - గజేంద్ర

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్​ నేడు 'స్వచ్ఛ సర్వేక్షణ్​ గ్రామీణ్​- 2019'ని ప్రారంభించారు. ఈ సర్వేలో దాదాపు 700 జిల్లాలు, 17,475 గ్రామాలు భాగం కానున్నాయి. మునుపటి సర్వే కంటే ఇది మూడింతలు పెద్దది.

స్వచ్ఛతలో మీ పల్లెకు ఎంత స్కోర్​ ఇస్తారు?

By

Published : Aug 14, 2019, 4:19 PM IST

Updated : Sep 27, 2019, 12:09 AM IST

దేశంలో గ్రామీణ పారిశుద్ధ్య ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా 'స్వచ్ఛ​ సర్వేక్షణ్​ గ్రామీణ్' సర్వేను ప్రారంభించింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 700 జిల్లాలు, 17,475 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే చేయనున్నారు.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్​ దిల్లీలో ఈ సర్వేను ప్రారంభించారు. ప్రజలు తమ స్పందన తెలియజేసేందుకు ఓ యాప్​ను ఆవిష్కరించారు.

గతంలో చేసిన సర్వే కంటే ఇంది మూడింతలు పెద్దది. 2018 సర్వేలో మొత్తం 6,000 గ్రామాలే భాగమయ్యాయి.

ఎలా చేస్తారు?

87 వేల బహిరంగ ప్రదేశాల్లో 45 రోజుల పాటు పారిశుద్ధ్య ప్రమాణాలను పరిశీలిస్తారు. ప్రతి గ్రామంలోనూ 5 ప్రదేశాలను ఎంచుకుంటారు. సెప్టెంబర్​ 30న సర్వే ముగుస్తుంది. రాష్ట్రాలకు, జిల్లాలకు వారి ప్రమాణాలను బట్టి ర్యాంకులను ప్రకటిస్తారు.

Last Updated : Sep 27, 2019, 12:09 AM IST

ABOUT THE AUTHOR

...view details