తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా: ప్రజలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు - కేంద్రం మార్గదర్శకాలు జారీ

కరోనా వైరస్ చైనాలో అంతకంతకూ విస్తరిస్తోన్న నేపథ్యంలో కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. డ్రాగన్ దేశంలో ప్రయాణాలను రద్దు చేసుకోవాలని దేశప్రజలకు సూచించింది. ముఖ్యంగా జనవరి 15 తర్వాత చైనాలో పర్యటించిన వారందరూ ప్రత్యేక శిబిరాల్లో వైద్య పరిశీలనలో ఉండాలని సూచించింది.

corona
కరోనా

By

Published : Feb 2, 2020, 10:56 PM IST

Updated : Feb 28, 2020, 10:38 PM IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్​లోనూ ఇప్పటి వరకు ఇద్దరికి ఈ వైరస్​ సోకింది. ఈ నేపథ్యంలో భారత్​ మరింత అప్రమత్తమైంది. కరోనా నియంత్రణకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. చైనాను ప్రయాణాలు రద్దు చేసుకోవాలని దేశప్రజలకు సూచించింది. జనవరి 15 తర్వాత చైనాలో పర్యటించిన వారందరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా తెలిపింది. పొరుగుదేశాల నుంచి వచ్చిన వారికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

కేబినెట్​ సెక్రటరీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షకు ఆరోగ్య, విదేశాంగ, హోం, పౌరవిమానయాన శాఖల ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రపంచదేశాల నుంచి వచ్చిన వారందరికీ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.ఇప్పటివరకు 445 విమానాల ద్వారా భారత్​లో అడుగుపెట్టిన 58,658మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 142మందిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచారు. చైనా నుంచి స్వదేశానికి చేరుకున్న ఇద్దరు కేరళీయులకు కరోనా సోకిందని వైద్యులు నిర్థరించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్​: ఈ-వీసాలను నిలిపివేసిన భారత్​

Last Updated : Feb 28, 2020, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details