తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై భారత్ భారీ​ యుద్ధం- త్రివిధ దళాలకు బాధ్యత

ప్రాణాంతక కరోనా వైరస్​ భారత్​లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో వైరస్​ను ఎదుర్కొనే బాధ్యతలను కేంద్రం.. త్రివిధ దళాలకు అప్పగించినట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఈ దళాల నేతృత్వంలో ఓ భారీ ఆపరేషన్​ జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

By

Published : Mar 3, 2020, 6:40 PM IST

Updated : Mar 3, 2020, 10:34 PM IST

Govt has asked Army,Navy&Air Force to be prepared for quarantine facilities for over 2500 suspected cases in coming days.
కరోనాపై భారత్ భారీ​ యుద్ధం- త్రివిధ దళాలకు బాధ్యత

కరోనాపై భారత్ భారీ​ యుద్ధం- త్రివిధ దళాలకు బాధ్యత

కరోనా వైరస్​పై భారీ యుద్ధానికి కేంద్రం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వైరస్​పై పోరుకు సిద్ధంగా ఉండాలని సైన్యం, నౌకాదళం, వాయు సేనలకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. బాధితులకు చికిత్స అందించడానికి అవసరమైన నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 2వేల 500 కేసులను ఏకకాలంలో ​పర్యవేక్షించే బాధ్యతలను త్రివిధ దళాలకు అప్పగించింది.

ఈ నేపథ్యంలోనే మార్చి 18న ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణంలో జరగాల్సిన నేవీ విన్యాస కార్యక్రమాలను రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 40 దేశాలు పాల్గొనే ఈ కార్యక్రమానికి కొత్త తేదీలు నిర్ణయించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది.

నిజానికి కరోనాపై భారత్​ ఫిబ్రవరిలోనే విజయం సాధించింది. కేరళలో నమోదైన మూడు కేసులను సమర్థంగా పరిష్కరించారు వైద్యులు. కానీ తాజాగా మరో ముగ్గురికి వైరస్​ సోకినట్టు అధికారులు నిర్ధరించారు. ప్రస్తుతం వారిని నిర్బంధంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాలో మరో ఆరుగురికి వైరస్​ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

Last Updated : Mar 3, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details