తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇక చంద్రబాబు చుట్టూ 'బ్లాక్​ క్యాట్స్'​ ఉండరు!

ఇటీవల గాంధీ కుటుంబానికి ఎస్​పీజీ (ప్రత్యేక రక్షణ దళం) భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వీఐపీ భద్రతలో అత్యంత కీలకమైన ఎన్​ఎస్​జీ (జాతీయ రక్షణ దళం) కమాండోలను తొలగించనుందట.

By

Published : Jan 12, 2020, 6:12 PM IST

Updated : Jan 12, 2020, 7:47 PM IST

Govt decides to withdraw NSG from VIP security duties
ఇక చంద్రబాబు చుట్టూ 'బ్లాక్​ క్యాట్స్'​ ఉండరు!

ఇక చంద్రబాబు చుట్టూ 'బ్లాక్​ క్యాట్స్'​ ఉండరు!

దేశంలోని వీఐపీల భద్రతా విధుల్లో బ్లాక్​ క్యాట్​ కమాండోలు ఇక ఉండరా? గాంధీల కుటుంబ భద్రతలో ప్రత్యేక రక్షణ దళం-ఎస్​పీజీని తొలగించినట్లే.. ఇక వీఐపీలకు జాతీయ రక్షణ దళం- ఎన్​ఎస్​జీ భద్రతను కేంద్రం తొలగించనుందా? ఔననే అంటున్నాయి అధికార వర్గాలు.

రెండు దశాబ్దాలుగా వీఐపీలకు బ్లాక్​ క్యాట్​ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు. తీవ్రవాద చర్యల నుంచి వీఐపీలను కాపాడేందుకు.. దీటైన భద్రత కోసం వీరిని ప్రభుత్వం వినియోగిస్తోంది. అయితే ఇప్పుడు ఈ భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఆ 13 మందికే...

ఎన్​ఎస్​జీ బ్లాక్​ క్యాట్​ కమాండోల భద్రత దేశంలోని 13 మందికి మాత్రమే ఉంది. అధునాతన ఆయుధాలను చేతబట్టి ఆ వీఐపీలు ఎక్కడికి వెళ్లినా వారి భద్రతను ఈ కమాండోలు పర్యవేక్షిస్తారు. ఒక్కొక్కరికి దాదాపు 24 మంది కమాండోలు రక్షణగా ఉంటారు.

ఏం చేస్తారు...?

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్​ యాదవ్​, ప్రకాశ్​ సింగ్​ బాదల్​, ఫరూక్​ అబ్దుల్లా, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​, మాజీ ఉప ప్రధాని ఎల్​కే అడ్వాణీకి భద్రత కల్పిస్తోన్న ఈ కమాండోల స్థానంలో త్వరలో పారామిలటరీ దళాలు రానున్నాయి.

ఎందుకు..?

ఎన్​ఎస్​జీ అనేది పేరుకు తగ్గట్లు జాతీయ భద్రత, తీవ్రవాదంపై పోరు, యాంటీ- హైజాక్​ ఆపరేషన్ల కోసం వినియోగించాలని భద్రతా అధికారులు భావిస్తున్నారట. ముప్పు ఎక్కువ ఉన్న ప్రముఖులకు ఎన్​ఎస్​జీ భద్రతను ఇవ్వడం కాస్త భారంగా ఉందని హోంమంత్రిత్వ శాఖ అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రత్యేక దళంగా...

వీఐపీలకు ఈ భద్రతను తొలగిస్తే 450 కమాండోలు ఖాళీ అవుతారు. వీరిని దేశంలోని ఐదు ప్రధాన రక్షణ కేంద్రాలు సహా దిల్లీ సమీపంలోని గురుగ్రామ్​లోని ముఖ్య రక్షణ స్థావరంలో నియమించనున్నారట.

సీఆర్​పీఎఫ్​...

ఈ 13 మంది వీఐపీల భద్రతను త్వరలో సీఆర్​పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​ చేపట్టనున్నాయి. ఇప్పటికే ఈ రెండు దళాలు దేశంలోని 130 మంది ప్రముఖుల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
ఈ మధ్యే ఎస్​పీజీ భద్రతను ఐదుగురు ప్రముఖులకు తొలగించారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ దంపతులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ జాబితాలో ఉన్నారు.

Last Updated : Jan 12, 2020, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details