దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలు జరిపి.. ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతుల న్యాయమైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో వివరించారు.
'2020 ముగిసేలోగా రైతు సమస్యలకు పరిష్కారం' - రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ప్రభుత్వం
రైతులకు సంబంధించి న్యాయమైన అన్ని సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. ఏడాది చివరి నాటికి ఈ ప్రతిష్టంభనకు తెరదింపాలని భావిస్తున్నట్లు తెలిపారు.
రైతులతో చర్చించేందుకు ఎల్లప్పుడూ సిద్ధం
పలు రైతు సంఘాలతో ప్రభుత్వ అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు తోమర్. ఏడాది చివరి నాటికి ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేసి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు తోమర్.
ఇదీ చూడండి:'నూతన సాగు చట్టాలతో రైతులకు ప్రమాదం'
Last Updated : Dec 18, 2020, 4:25 PM IST