ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఆంక్షలు విధించిన కేంద్రం ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాల కోసం మంత్రుల బృందం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది.
ఈ బృందంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సామాజిక న్యాయ మంత్రి ధావర్ చంద్ గహ్లూత్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రధాని కార్యలయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బృందంలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంది.