తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతిని ఉదయం నాలుగింటికి నిద్రలేపుతారా?: చిదంబరం - p chidambaram news today

మహారాష్ట్ర వ్యవహారంలో భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఆయన... అర్ధరాత్రి వ్యవహారానికి గవర్నర్​, ప్రధాని, రాష్ట్రపతి బాధ్యత వహించాలన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి పాలుపంచుకోవటం విచారకరమని.. ఆయన ఉదయం నాలుగింటికి నిద్రలేవటం బాధ కలిగించిందన్నారు.

Chidambaram
చిదంబరం

By

Published : Nov 27, 2019, 5:01 PM IST

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పి. చిదంబరం. దేవేంద్ర ఫడణవీస్​, అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారం చేసిన వ్యవహారంలో గవర్నర్​, ప్రధాని, రాష్ట్రపతి బాధ్యత వహించాలన్నారు.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో భాగంగా దిల్లీ కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు చిదంబరం.

రాష్ట్రపతిని ఉదయం నాలుగింటికి నిద్రలేపుతారా?: చిదంబరం

"ఆ విధంగా వారు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ రకంగా వారు రాజ్యాంగానికి గౌరవం ఇచ్చారు. అర్ధరాత్రి వ్యవహారానికి గవర్నర్​, ప్రధానమంత్రి, రాష్ట్రపతి బాధ్యత వహించాలి. ఈ ప్రక్రియలో రాష్ట్రపతి పాలుపంచుకోవటం విచారకరం. ఉదయం నాలుగింటికి రాష్ట్రపతిని నిద్రలేపినందుకు నేను చాలా బాధపడుతున్నాను."
- పి. చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్​ నేత

డిసెంబర్​ 11 వరకు కస్టడీ పొడగింపు..

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో అరెస్టయిన చిదంబరం జుడీషియల్​ కస్టడీని డిసెంబర్​ 11 వరకు పొడిగించింది దిల్లీ కోర్టు.

మరో 14 రోజులు కస్టడీని పొడగించాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ చేసిన అభ్యర్థన మేరకు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​ కుహార్​ ఆదేశాలు జారీ చేశారు. ఈడీ పిటిషన్​ను​ చిదంబరం తరఫు న్యాయవాది వ్యతిరేకించకపోవటం గమనార్హం.

ఇదీ చూడండి:ఎస్పీజీని గత ప్రభుత్వాలు నీరుగార్చాయి: షా

ABOUT THE AUTHOR

...view details