తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2020, 12:17 PM IST

Updated : Oct 15, 2020, 12:56 PM IST

ETV Bharat / bharat

కరోనా టీకా సింగిల్​ డోస్​.. కేవలం 75 రూపాయలు!

కరోనా విలయం కొనసాగుతున్న తరుణంలో అందరి చూపు వ్యాక్సిన్​ వైపే ఉంది. టీకాను అందరికీ సరఫరా చేయాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికంగానే పడుతుంది. ఇందుకోసం వ్యాక్సిన్​పై ప్రత్యేక సుంకం విధించకూడదని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ట్రయల్స్​లో ఉన్న టీకా కేవలం రూ.75కే అందుబాటులోకి వస్తుందని అంచనా.

governments sources are saying there will be no tax for covid 19 vaccine in india
కరోనా వ్యాక్సిన్​పై సుంకం ఉండదా?

కొవిడ్​-19 వ్యాక్సిన్​పై సుంకం ఉంటుందా? ఉండదా అనే చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా అధిపతి అదార్​ పూనావాలా.. టీకా కొనుగోలు చేసి, దేశవ్యాప్తంగా సరఫరా చేయాలంటే సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ రకంగా చూస్తే ప్రభుత్వానికి అది భారీ వ్యయమే.

ఆ అవసరం లేదు..

ప్రభుత్వ వర్గాలు మాత్రం టీకా కోసం ప్రత్యేక సుంకం విధించే ప్రతిపాదన లేదని చెబుతున్నాయి. ప్రాథమిక దశలోటీకా కొనుగోలు చేసి.. ప్రజలకు సరఫరా చేసేందుకు అవసరమైన మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుందని అంటున్నాయి. అందుకు కావాల్సిన ఆర్థిక వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ప్రత్యేక సుంకం విధించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నాయి.

ధర తగ్గే అవకాశం..

సీరం ఇన్​స్టిట్యూట్​ లెక్కలను కూడా కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు అంగీకరించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు టీకా తయారీలో ఉన్నాయని, దానివల్ల టీకా ధర తగ్గే అవకాశముందని భావిస్తున్నాయి. టీకా సింగిల్​ డోస్​ సరిపోతుందా..? డబుల్​ డోస్​ అవసరమా..? అనేది ట్రయల్స్​ పూర్తయన తర్వాతే ఒక అంచనాకు రాగలమని చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే డోసు ధర సుమారు రూ.75 ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కచ్చితమైన ధర.. వచ్చే ఏడాది జులైకు ముందు మాత్రమే తెలియొచ్చని ఓ కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా 73 లక్షలకు చేరిన కరోనా కేసులు

Last Updated : Oct 15, 2020, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details