తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగ్లాకు 10 డీజిల్​ ఇంజిన్లు పంపించిన భారత్​ - Railway Minister Piyush Goyal

బంగ్లాదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆ దేశానికి 10 బ్రాడ్‌గేజ్‌ డీజిల్‌ లోకోమోటివ్‌లను భారత్‌ పంపింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌... వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి ఇంజిన్లను పంపించారు.

Government of India sent 10 diesel locomotive engines to the Bangladesh
బంగ్లాకు 10 డీజిల్​ ఇంజిన్లు పంపించిన భారత్​

By

Published : Jul 28, 2020, 6:50 AM IST

పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిలో భాగంగా ఆ దేశానికి 10 బ్రాడ్‌గేజ్‌ డీజిల్‌ లోకోమోటివ్‌లను భారత్‌ పంపింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌లు సోమవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా బంగ్లాకు బయలుదేరిన ఇంజిన్లకు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో బంగ్లా నుంచి ఆ దేశ రైల్వే మంత్రి నురుల్‌ ఇస్లామ్‌ సుజన్‌, విదేశీ వ్యవహారాల మంత్రి అబుల్‌ కలామ్‌ అబ్దుల్‌ మోమెన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జయశంకర్‌... రెండు దేశాల మధ్య రైల్వే భాగస్వామ్యం మరింత మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. గోయల్‌ మాట్లాడుతూ.. రెండు దేశాల అర్థిక భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడంలో రైల్వే శాఖల సహకారం కీలకమైందన్నారు.

2019 అక్టోబరులో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటన సందర్భంగా చేసిన విజ్ఞప్తిని నెరవేర్చే క్రమంలో ఈ లోక్‌మోటివ్‌లను అప్పగించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. భారత్‌ తమ దేశానికి 10 డీజిల్‌ లోకోమోటివ్‌లనుఅందించినందుకు బంగ్లాదేశ్‌ కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీ చూడండి:యూఏఈలో రఫేల్ దళం​.. బుధవారం భారత్​కు రాక

ABOUT THE AUTHOR

...view details