దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ తరుణంలో హరియాణాలోని వ్యవసాయ నిపుణులు జేఎస్ టూర్ను ఈటీవీ-భారత్ సంప్రదించింది. రైతులు కన్నెర్ర చేసిన నూతన వ్యవసాయ చట్టాలపై టూర్తో చర్చించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'డబ్ల్యూటీఓతో భారత్ ఒప్పందం..'
నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకొచ్చింది. అందుకు ముందుగానే.. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశం కూడా తమ రైతుల ఉత్పత్తులో 10శాతం మించి కొనుగోలు చేయకూడదని ఆ ఒప్పందం సూచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే కేంద్రం ఈ నూతన సాగు చట్టాలను తీసుకొచ్చింది.
'ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యమే'
నూతన చట్టాల్లో కనీస మద్దతు ధర ప్రస్తావనే లేదు. ఇందువల్ల ప్రైవేటు వ్యక్తులు మార్కెట్లోకి వస్తారు. తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తారు.