భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత సరిహద్దుల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ తరవాత సరిహద్దులను రక్షించుకోగల సామర్థ్యం భారత్కు ఉందంటూ షా చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు రాహుల్.
'సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. హృదయాన్ని సంతోషంగా ఉంచడానికి మంచి ఆలోచన అవసరం.'