తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్లు బాగుంటే ప్రమాదాలు పెరుగుతాయి: మంత్రి - DEPUTY CM on traffice fines

రోడ్లు బాగుండటమే ప్రమాదాలకు కారణమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్​ కర్జోల్​ అన్నారు. హైవేలు, మంచి రహదారులపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారాయన.

గోవింద్​ కర్జోల్​, కర్ణాటక ఉపముఖ్యమంత్రి

By

Published : Sep 12, 2019, 1:47 PM IST

Updated : Sep 30, 2019, 8:14 AM IST

కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ప్రజాపనుల శాఖ మంత్రి గోవింద్​ కర్జోల్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ జరిమానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ప్రమాదాలకు మంచి రహదారులే కారణమన్నారు.

గోవింద్​ కర్జోల్​, కర్ణాటక ఉపముఖ్యమంత్రి

"మంచి, మామూలు రహదారులే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైవేలను చూడండి... 100, 160 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళతాయి. ట్రాఫిక్​ ఉల్లంఘనలపై భారీ చలానాలపై వ్యతిరేకతను నేను సమర్థిస్తాను. రాష్ట్ర కేబినెట్​తో చర్చించి జరిమానాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటా."

-గోవింద్​ కర్జోల్​, కర్ణాటక ఉపముఖ్యమంత్రి


అయితే భారీ జరిమానాలు విధించే ముందు రహదారుల నిర్వహణ మెరుగుపరచాలని అన్నారు.

గోవింద్​ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బ్రిజేశ్​ కాలప్ప స్వాగతించారు.

ఇదీ చూడండి: కేంద్ర రవాణాశాఖ మంత్రికే తప్పని ట్రాఫిక్​ చలానా!

Last Updated : Sep 30, 2019, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details