తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2019, 4:35 PM IST

Updated : Sep 28, 2019, 6:14 PM IST

ETV Bharat / bharat

చిదంబరం అరెస్టుపై ఇంద్రాణి ముఖర్జీ హర్షం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరం అరెస్టవ్వడం శుభ వార్తని అన్నారు ఆ సంస్థ మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జీ. కేంద్ర మాజీ మంత్రికి అన్ని దారులు మూసుకుపోయాయని అభిప్రాయపడ్డారు.

చిదంబరం అరెస్టుపై ఇంద్రాణి ముఖర్జీ హర్షం

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అరెస్టు శుభ వార్త అన్నారు ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూప్ మాజీ​ ప్రమోటర్​ ఇంద్రాణి ముఖర్జీ. చిదంబరానికి అన్ని దారులు మూసుకుపోయాయని హత్య కేసు విచారణ కోసం ముంబయి ప్రత్యేక న్యాయస్థానానికి హాజరైన సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరాన్ని ఈ నెల 21 అరెస్టు చేశారు.

కుమార్తె షీనా బోరా హత్య కేసులో ముంబయిలో జైలు జీవితం గడుపుతున్నారు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్​ ముఖర్జీ. ఐఎన్​ఎక్స్​ మీడియాకు వీరు ఒకప్పుడు ప్రమోటర్లు. చిదంబరానికి చెందిన సంస్థకు అక్రమంగా నిధులు అందించారని వీరు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఐఎన్​ఎక్స్ కేసులో ఈ ఏడాది జులైలో ఇంద్రాణి అప్రూవర్​గా మారారు. చిదంబరానికి, ఆయన కుమారుడు కార్తీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలమే చిదంబరం అరెస్టుకు కీలకమైంది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో మరో నిందితుడు కార్తీ చిదంబరానికి మంజూరు చేసిన బెయిల్​ను రద్దు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు ఇంద్రాణి.

ఇదీ చూడండి:- కపిల్​దేవ్ రికార్డుపై కన్నేసిన ఇషాంత్ శర్మ

Last Updated : Sep 28, 2019, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details