కర్ణాటక చిక్ మంగళూరు జిల్లాలోని కొప్పా నగరంలో ఓ మేక.. తన యజమాని అంతిమయాత్రలో పాల్గొని విశ్వాసాన్ని చాటుకుంది. హుసేనబ్బ అనే మత్స్యకారుడు చాలా ఏళ్ల నుంచి ఓ మేకను పెంచుతున్నారు. ఆయన శుక్రవారం గుండెపోటుతో మరణించారు.
మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక! - అంతిమయాత్రలో పాల్గొన్న మేక
మూగజీవాలు..తమ యజమానులపై ఎంతగా అభిమానం, విశ్వాసం చూపుతాయనే దానికి.... కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది.
![మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4804754-thumbnail-3x2-goat.jpg)
మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక!
మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక!
ఇన్నాళ్లూ తనను పెంచిన యజమాని అకస్మాత్తుగా మరణించడం వల్ల ఆ మూగజీవం తల్లడిల్లింది. యజమాని అంతిమయాత్రలో కడదాకా పాల్గొని వీడ్కోలు పలికింది.
- ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!
Last Updated : Oct 19, 2019, 7:44 PM IST