గోవాలో అసెంబ్లీ వర్షకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర స్పీకర్ రాజేష్ పట్నేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరికీ కరోనా పరీక్షలు - గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేష్ పట్నేకర్
గోవాలోని ఎమ్మెల్యేలందరూ కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. జులై 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజేశ్ పట్నేకర్ ఈ మేరకు కోరారు.
ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరికి కరోనా పరీక్షలు
వివిధ కారణాల దృష్ట్యా ఎమ్మెల్యేలు ప్రజలను కలుస్తారు కనుక తప్పనిసరిగా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని పట్నేకర్ అన్నారు. ఇటీవల ఓ భాజపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. జులై 27 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.