తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2020, 7:24 AM IST

Updated : Feb 28, 2020, 2:40 AM IST

ETV Bharat / bharat

బంపర్ ఆఫర్: నీళ్ల​ సీసాలు ఇస్తే.. టీ​ ఉచితం

ప్లాస్టిక్​ను త్యజించాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేసినా.. వాటి​ వినియోగం మాత్రం ఆగడం లేదు. అయితే అధికార యంత్రాగం, కొందరు పర్యావరణ వేత్తలు ప్లాస్టిక్​కు అడ్డుకట్ట వేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని విజయపురను ప్లాస్టిక్​ రహితంగా మార్చేందుకు నగరపాలక​ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్​ నీళ్ల సీసా ఇస్తే.. ఛాయ్​ ఉచితంగా ఇస్తున్నారు.

get-a-cup-of-tea-free-in-exchange-for-plastic-bottle
ప్లాస్టిక్​పై పోరు: నీళ్ల​ సీసాలు ఇస్తే.. టీ​ ఉచితం

ప్లాస్టిక్​పై పోరు: నీళ్ల​ సీసాలు ఇస్తే.. టీ​ ఉచితం

ప్లాస్టిక్​ను అరికట్టేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కర్ణాటకలోని విజయపుర నగరపాలక​ అధికారులు. ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్లాస్టిక్​ సీసాలను సేకరిస్తున్నారు. సీసా ఇస్తే.. టీ ఉచితం అంటూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.

విజయపురను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

"వాడిపడేసిన ప్లాస్టిక్​ సీసాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటి సీసాలను మేము ఇందిరా క్యాంటీన్​కు అందిస్తే మాకు ఉచితంగా టీ ఇస్తున్నారు. ఇది నిజంగా మంచి కార్యక్రమం. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఇక్కడ సేకరించిన సీసాలను సిమెంట్​ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఈ కార్యక్రమం చాలా ఉపయోగరకమైనది."

-ప్రశాంత్​, స్థానికుడు

క్యాంటీన్​లో సేకరించిన సీసాను అధికారులు బగల్​కోట్​లోని జేకే సిమెంట్​ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ప్లాస్టిక్​ను కలపడం వల్ల సిమెంట్​ మరింత నాణ్యతతో ఉంటుంది.

ప్లాస్టిక్​ను అరికట్టడంలో భాగంగా విజయపుర నగరపాలక​ అధికారులు ఇటీవల విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. దాదాపు 14 టన్నుల ప్లాస్టిక్​ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
రోజూ ఇందిరా క్యాంటీన్ల ద్వారా దాదాపు 400 కేజీల ప్లాస్టిక్​ను సేకరిస్తున్నారు.

Last Updated : Feb 28, 2020, 2:40 AM IST

ABOUT THE AUTHOR

...view details