భారత్లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ దిల్లీలోని వాయుకాలుష్యాన్ని చూసి చలించిపోయారు. పట్టణాల్లో పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ యూరోలు (సుమారు 7,914 కోట్లు) పెట్టుబడి పెడతామని తెలిపారు.
మెర్కెల్ పర్యటిస్తుండగా దిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. ఈ సమస్య నివారణకు డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కిచెప్పారు.
తమిళనాడుకు..
తమిళనాడులో బస్సు రంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు మెర్కెల్. దీనికోసం 200 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెడతామన్నారు.
కలిసి ముందుకెళ్దాం