తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిలియన్​​ యూరోల పెట్టుబడికి మెర్కెల్​  హామీ - భారత్​కు బిలియన్ యూరోల సాయం ప్రకటించిన ఏంజెలా మెర్కెల్

భారత్​లో పర్యావరణ హిత పట్టణ రవాణా కోసం వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ యూరోలు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్​. తమిళనాడు బస్సు రంగాన్ని సంస్కరించేందుకు 200 మిలియన్ యూరోలు అందిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలో వాయుకాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

దిల్లీ కాలుష్యంపై చలించిన మెర్కెల్​.. భారీ పెట్టుబడికి హామీ

By

Published : Nov 2, 2019, 5:39 PM IST

Updated : Nov 2, 2019, 8:39 PM IST

భారత్​లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మార్కెల్​ దిల్లీలోని వాయుకాలుష్యాన్ని చూసి చలించిపోయారు. పట్టణాల్లో పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్​ యూరోలు (సుమారు 7,914 కోట్లు) పెట్టుబడి పెడతామని తెలిపారు.

మెర్కెల్​ పర్యటిస్తుండగా దిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. ఈ సమస్య నివారణకు డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కిచెప్పారు.

తమిళనాడుకు..

తమిళనాడులో బస్సు రంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు మెర్కెల్​. దీనికోసం 200 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెడతామన్నారు.

కలిసి ముందుకెళ్దాం

ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, కృత్రిమ మేధ సహా వివిధ రంగాల్లో భారత్​తో కలిసి పనిచేయడానికి జర్మనీ సంసిద్ధంగా ఉందని మెర్కెల్ పేర్కొన్నారు.

స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం..

భారత్-ఐరోపా సమాఖ్య (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో ఏర్పడిన అంతరాల వల్ల 2013 నుంచి చర్చలు నిలిచిపోయాయి. ఈ చర్చలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేయడానికి భారత్​ - జర్మనీ అంగీకారానికి వచ్చాయి.

జూన్ 2007నాటి ఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. మేధో హక్కులు, వాహనరంగంలో పన్నుల తగ్గింపు, సులభతర వీసాల మంజూరు వంటి విషయాల్లో భారత్-ఈయూ మధ్య అంతరాలు ఏర్పడ్డాయి.

ఇదీ చూడండి:ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

Last Updated : Nov 2, 2019, 8:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details