తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ప్రత్యేక ప్రధాని ఆశలు ఎప్పటికీ నెరవేరవు"​

దేహం నుంచి హృదయాన్ని విడదీయలేనట్టే భారత్​ నుంచి కశ్మీర్​ను వేరుచేయలేమని భాజపా నేత గౌతమ్​ గంభీర్​ ఉద్ఘాటించారు. కేంద్ర మంత్రి జితేందర్​ సింగ్​కు మద్దతుగా జమ్ముకశ్మీర్​లో ప్రచారం నిర్వహించిన ఈ మాజీ క్రికెటర్​ మెహబూబా ముఫ్తీ, ఓమర్​ అబ్దుల్లాలపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రధాని ఉండాలన్న కోరిక ఎప్పటికీ నెరవేరదని తెలిపారు.

By

Published : Apr 12, 2019, 6:25 AM IST

Updated : Apr 12, 2019, 9:21 AM IST

ప్రత్యేక ప్రధానిపై ఆశలు ఎప్పటికీ నెరవేరవు

గౌతమ్​ గంభీర్​

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఓమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై భాజపా నేత గౌతం గంభీర్​ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్​​ 370ని రక్షించుకుంటామని వారు చేసిన వ్యాఖ్యలను గంభీర్​ ఖండించారు. ఇకపై దేశంలో ఇలాంటి రాజకీయాలు చేయలేరని హెచ్చరించారు. ప్రత్యేక హక్కులున్న రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాని ఉండాలన్న ఆశలు ఏనాటికీ నెరవేరవని స్పష్టం చేశారు.

ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న ఈ మాజీ క్రికెటర్​...​ కేంద్ర మంత్రి జితేందర్​ సింగ్​కు మద్దతుగా ఉధమ్​పుర్​ జిల్లాలోని రామ్​ నగర్​, కథువాలోని నగ్రిలో ప్రచారం నిర్వహించారు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు భారత్​ ఒకే దేశమని ఉద్ఘాటించారు గంభీర్​.

" కశ్మీర్​ మన దేశంలోని అంతర్గత భాగం. మాకు కశ్మీర్​ హృదయంతో సమానం. దేహం నుంచి మనసును విడదీయలేము. అలాగే కశ్మీర్​ భారత్​లో అంతర్గత భాగం. అధికారాన్ని వదులుకోలేకనే మెహబూబా ముఫ్తీ ఆర్టికల్​ 370పై మాట్లాడుతున్నారు. దేశం, రాష్ట్రం కోసం వారు ఏమీ చేయాలనుకోవట్లేదు. "
-గౌతమ్​ గంభీర్​, భాజపా నాయకుడు.

ఆర్టికల్​ 370ని రద్దు చేస్తే కశ్మీర్​లో భారత రాజ్యంగం వర్తించదన్న మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ వ్యాఖ్యలు దురదృష్టకరమని గంభీర్ పేర్కొన్నారు​.

ప్రధానమంత్రి మోదీ ప్రేరణతోనే భాజపాలో చేరానని చెప్పారు గంభీర్​. లోక్​సభ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలని ఉధమ్​పుర్​, కథువా ప్రజలను కోరారు గంభీర్​.

Last Updated : Apr 12, 2019, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details