తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాంబ్ పడిందని అనుకున్నారు కానీ... - వైమానిక దళం

తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద.. గగనతలంలో ఉన్న తేజస్ యుద్ధ విమానం నుంచి ఇంధన ట్యాంకు ఊడి, కిందపడింది. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని, యుద్ధ విమానం సురక్షితంగా ల్యాండ్​ అయిందని వైమానిక దళాధికారులు తెలిపారు.

బాంబ్ పడిందని అనుకున్నారు కానీ...

By

Published : Jul 2, 2019, 12:58 PM IST

Updated : Jul 2, 2019, 1:11 PM IST

బాంబ్ పడిందని అనుకున్నారు కానీ...

తేజస్​ యుద్ధ విమానం నుంచి ఇంధన ట్యాంక్​ కిందపడిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటుచేసుకుంది.

తేజస్​ యుద్ధ విమానం నుంచి 1200 లీటర్ల ఇంధన ట్యాంకు ఇరుగూరు ప్రాంతంలోని పంట పొలాల్లో పడింది. ట్యాంకు పడిన ధాటికి 3 అడుగుల లోతు గుంత ఏర్పడి.. చిన్నస్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే నగర శివార్లలో ఈ ఘటన జరగడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ దృశ్యాలు చూసి స్థానిక గ్రామ వ్యవసాయ కూలీలు ఆశ్చర్యపోయారు.

ఘటన అనంతరం తేజస్ యుద్ధ విమానం సురక్షితంగా సూలూరు ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​కు చేరుకుంది. ప్రమాద స్థలానికి వైమానిక దళ అధికారులు చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీ వర్షాలు - రోడ్లు జలమయం

Last Updated : Jul 2, 2019, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details