తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు ఫ్రాన్స్​ మద్దతు - ఐక్యరాజ్య సమితి

ఐరాస భద్రతా మండలిలో భారత్​ శాశ్వత సభ్యత్వంపై తమ మద్దతుంటుందని ఫ్రాన్స్ మరోసారి స్పష్టం చేసింది. భారత్​తో పాటు బ్రెజిల్​, జర్మనీ, జపాన్​లనూ ఇందుకు ప్రతిపాదించాలని నిర్ణయించింది.

భారత్​, ఫ్రాన్స్​

By

Published : Mar 4, 2019, 3:30 PM IST

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్​ శాశ్వత సభ్యత్వంపై ఫ్రాన్స్ మద్దతుగా నిలిచింది. మండలిని విస్తరించాలని ఐరాసను కోరతామని ఫ్రాన్స్​ మరోసారి స్పష్టంచేసింది. యూఎన్​ఎస్​సీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్​కు ఫ్రాన్స్ మద్దతివ్వడం విశేషం.

ఎప్పటినుంచో ఐరాస భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న భారత్... బ్రెజిల్​, జపాన్​, జర్మనీ, జపాన్​లకూ ఇవ్వాలని కోరుతోంది​. ఈ దేశాలన్నీ శాశ్వత సభ్యత్వానికి అర్హమైనవేనని భారత్​ భావిస్తోంది.

ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న 15 దేశాల్లో ఫ్రాన్స్​ ఒకటి. జైషే మహమ్మద్​ అధినేత మసూద్​ అజర్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్​ ఐరాస భద్రతా మండలికి ప్రతిపాదించింది. అమెరికా, బ్రిటన్​ ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాయి.

"భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచాలని మేం కోరుకుంటున్నాం. భారత్​, బ్రెజిల్​, జర్మనీ, జపాన్​ దేశాలు ఐరాసలో కీలకంగా ఉండాలనేదే మా భావన"-ఐరాసలో ఫ్రాన్స్​ ప్రతినిధి డెలాట్రే

జర్మనీ ఏప్రిల్​లో ఐరాస భద్రతా మండలిలో చేరనుంది.
ఫ్రాన్స్​, జర్మనీ ముక్తకంఠంతో ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని కోరతాయని డెలాట్రే తెలిపారు. ఒకవేళ సంస్కరణలు జరగకుంటే... భద్రతా మండలి ధర్మం తప్పినట్టేనని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details