తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో ఘోర ప్రమాదం- నలుగురు మృతి

మహారాష్ట్ర పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొని నలుగురు మరణించారు.

By

Published : Aug 28, 2020, 12:17 PM IST

Four persons were killed on the spot on kalyan nagar highway
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణెలోని కల్యాణ్​ నగర్​ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఓ డ్రైవర్​కు తీవ్రంగా గాయాలవ్వగా.. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.

అలెఫాటా నుంచి కోళ్ల ఎరువుతో వెళ్తున్న ఓ​ ట్రక్కు.. వడ్​గావ్​​ ఆనంద్​ సమీపంలో ఎదురుగా వస్తోన్న మరో ట్రక్కును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది.

ఇదీ చదవండి:ఆకాశంలో పటిష్ఠ నిఘా నేత్రం!

ABOUT THE AUTHOR

...view details