తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రహదారిపై బస్సు బోల్తా-నలుగురు మృతి - Road accident in rajsamand News In telugu

రాజస్థాన్​ రాజ్సమండ్​లో ఓ బస్సు బోల్తాపడింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ 23మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

four-people-dead-more-than-ten-injured-in-a-horrific-road-accident-in-rajsamand
రహదారిపై బస్సు బోల్తా-నలుగురు మృతి

By

Published : Mar 1, 2020, 11:29 AM IST

Updated : Mar 3, 2020, 1:12 AM IST

రాజస్థాన్​ రాజ్సమండ్ జిల్లా దివేర్​ ప్రాంతంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 8వ నంబరు జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్​ బస్సు బోల్తా పడింది. ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

రహదారిపై బస్సు బోల్తా-నలుగురు మృతి, 23 మందికి గాయాలు

గుజరాత్​ నుంచి జైపూర్ ప్రయాణిస్తున్న వీడియో కోచ్​ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంతో కిలోమీటరు మేర రవాణా స్థంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్​ సాయంతో బోల్తాపడ్డ బస్సును పక్కకు తీసి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు.

ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు కూడా ఉండటం స్థానికులను కలచివేస్తోంది.

ఇదీ చదవండి:కన్నతల్లి కోసం ఖండాంతరం దాటిన ప్రేమ

Last Updated : Mar 3, 2020, 1:12 AM IST

ABOUT THE AUTHOR

...view details