తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బావిలో విషవాయువు.. నలుగురు మృతి - బావిలో నీటిని నింపుతున్న ఘటన

బావిలో నీటిని నింపటానికి దిగిన వ్యక్తి మరణించిన ఘటన మహారాష్ట్ర గోందియా జిల్లా పాంగావాత్​‌లో జరిగింది. అతడిని కాపాడటానికి దిగిన మరో ముగ్గురు కూడా మృత్యుఒడికి చేరారు. విషవాయువు లీకవడమే మరణాలకు కారణంగా తెలుస్తోంది.

Four men died due to poisonous gas in the well One of them was working in well
బావిలో విషవాయువు.. నలుగురు మృతి

By

Published : Jul 2, 2020, 2:33 PM IST

మహారాష్ట్ర గోందియా జిల్లాలోని పాంగావాత్​లో దారుణం జరిగింది. ఓ బావిలో నీరు నింపడానికి దిగాడు ఓ వ్యక్తి. కానీ ఎన్నో రోజుల నుంచి శుభ్రం చేయకపోవటం వల్ల బావి నుంచి విషవాయువు వెలువడింది. ఆ విషపుగాలి పీల్చి.. ఊపిరాడక సదరు వ్యక్తి మరణించాడు. అతడి అరుపులతో కాపాడేందుకు బావిలోకి దిగిన మరో ముగ్గురు వ్యక్తులూ ప్రాణాలు కోల్పోయారు.

నీటిని నింపుతున్న బావి
బావిని పరిశీలిస్తున్న ప్రజలు
బావి

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. నలుగురు వ్యక్తుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇదీ చూడండి:మరోసారి పాక్​ దుర్నీతి.. సరిహద్దు వెంబడి కాల్పులు

ABOUT THE AUTHOR

...view details