తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 3:21 PM IST

Updated : Jul 10, 2020, 3:34 PM IST

ETV Bharat / bharat

బిహార్​లో ఎన్​కౌంటర్​- నలుగురు మావోయిస్టులు మృతి

encounter
నలుగురు మావోయిస్టులు

15:28 July 10

బిహార్​ పశ్చిమ చంపారన్ జిల్లా బగాహాలో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. సశస్త్ర సీమా బల్ (ఎస్​ఎస్​బీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్.. సంయుక్తంగా కూబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. దీనితో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.

ఘటనాస్థలంలో దొరికిన మూడు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ సహా వివిధ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.

15:17 July 10

బిహార్​లో ఎన్​కౌంటర్​- నలుగురు మావోయిస్టులు మృతి

బిహార్​లోని భారత్​- నేపాల్​ సరిహద్దు వద్ద ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు సశస్త్ర సీమా బల్​ అధికారి వెల్లడించారు.

Last Updated : Jul 10, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details