తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షీలాదీక్షిత్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ భౌతిక కాయాన్ని తూర్పు నిజాముద్దీన్​లోని ఆమె స్వగృహంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు రాజకీయ నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్, జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా.. షీలా దీక్షిత్​కు నివాళులర్పించారు.

By

Published : Jul 21, 2019, 10:34 AM IST

షీలా పార్థివ దేహానికి ప్రముఖల నివాళి

షీలా పార్థివ దేహానికి ప్రముఖల నివాళి

షీలా దీక్షిత్​ భౌతిక కాయాన్ని సందర్శించడానికి దిల్లీలోని ఆమె స్వగృహానికి సీనియర్​ నేతలు, కాంగ్రెస్​ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్..​ షీలా భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈరోజు మధ్యాహ్నం దిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయానికి షీలా పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఆమె అంత్యక్రియలు నిగంబోధ్​ ఘాట్​ వద్ద జరగనున్నాయి.

కాంగ్రెస్​ సీనియర్​ నేత షీలా దీక్షిత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు.

ఇదీ చూడండి: ప్రియాంకకు బాసటగా షీలా దీక్షిత్ ఆఖరి నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details