తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోర్బ్స్​: భారత అపరకుబేరుడు మళ్లీ ముకేశ్​ అంబానీనే - mukesh ambani

2018కి ఏడాదికి గాను ఫోర్బ్స్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 51.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 15.7 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో అదానీ పోర్ట్స్ అధినేత గౌతమ్​ అదానీ ఉన్నారు.

ఫోర్బ్స్​: భారత అపరకుబేరుడు మళ్లీ ముకేశ్​ అంబానీనే

By

Published : Oct 11, 2019, 10:12 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ భారత అపరకుబేరుల్లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 51.4 బిలియన్​ డాలర్లు. జియో వల్ల ఆయన సంపద 4.1 బిలియన్​ డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది.

అదానీ పోర్ట్స్ అధినేత గౌతమ్​ అదానీ ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 15.7 బిలియన్​ డాలర్లు. గతేడాది రెండో స్థానంలో ఉన్న అజిమ్​ ప్రేమ్​జీ ఈసారి 17వ స్థానానికి పడిపోయారు. అజిమ్ ప్రేమ్​జీ తన సంపదలో చాలా వరకు దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
3,4,5 స్థానాల్లో హిందూజా బ్రదర్స్​, పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ, ఉదయ్​ కోటక్​ ఉన్నారు. ఉదయ్​కోటక్ టాప్​ 5లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.

బైజూ రవీంద్రన్​..

ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్​ బైజూ అధినేత బైజూ రవీంద్రన్ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 1.91 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 72వ స్థానంలో నిలిచారు. బైజూ యాప్​ను ప్రారంభించిన ఏడేళ్లలోనే రవీంద్రన్​ బిలియనీర్​గా అవతరించారు. ఈసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రవీంద్రన్ సహా మరో ఐదుగురు పారిశ్రామిక వేత్తలకు తొలిసారి స్థానం దక్కింది.

ఇదీ చూడండి:ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి బహుమతి

ABOUT THE AUTHOR

...view details