తెలంగాణ

telangana

By

Published : May 12, 2020, 12:04 AM IST

Updated : May 12, 2020, 7:15 AM IST

ETV Bharat / bharat

'కరోనాపై గెలుపు తథ్యం.. భౌతిక దూరమే మంత్రం'

కరోనా వ్యాప్తి రేటు తగ్గించి ప్రజా కార్యకలాపాలు పునః ప్రారంభంపై ప్రస్తుతం దృష్టి సారించాలని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైల్వే సర్వీసుల ప్రారంభించడం సైతం ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో భాగమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రులతో మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన వెలువరించింది.

modi
మోదీ

కరోనా వ్యతిరేక పోరులో భాగంగా వ్యాప్తి రేటు తగ్గించి, మార్గదర్శకాలకు లోబడి ప్రజా కార్యకలాపాలు జరిగేలా చేయడమే ప్రస్తుతం దృష్టిసారించాల్సిన అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో భాగంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రుల సూచనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​కి సంబంధించి... ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది. రైల్వే సర్వీసులను పునఃప్రారంభించడం సైతం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకేనని మోదీ అభిప్రాయపడ్డట్లు అందులో పేర్కొంది. అన్ని రూట్లలో సర్వీసులకు ఇప్పుడే అనుమతించేది లేదని మోదీ స్పష్టం చేసినట్లు తెలిపింది.

"వ్యాప్తి రేటు తగ్గించి, మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా కార్యకలాపాలు జరిగేలా చేయడం పైనే ప్రస్తుతం దృష్టి సారించాలి. ఈ రెండు లక్ష్యాలను అందుకోవడానికి మనం పనిచేయాలి. మొదటి లాక్​డౌన్​లో తీసుకున్న చర్యలు రెండో లాక్​డౌన్​లో పనిచేయకపోవచ్చు. అదేవిధంగా మూడో లాక్​డౌన్​లో అవసరమయ్యే చర్యలు నాలుగో లాక్​డౌన్​లో అవసరం ఉండవు."

- ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ

ఈ మేరకు లాక్​డౌన్​పై రాష్ట్రాల అభిప్రాయాన్ని మోదీ కోరారు. లాక్​డౌన్​ను ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారనే విషయంపై మే 15 లోగా విస్తృతమైన వ్యూహాలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.

Last Updated : May 12, 2020, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details