తెలంగాణ

telangana

పాల్​గఢ్​లో ఒకేరోజు 5 భూకంపాలు

By

Published : Nov 10, 2020, 5:48 AM IST

మహారాష్ట్రలోని పాల్​గఢ్​ జిల్లాలో ఒకరోజే ఐదుసార్లు భూమి కంపించింది. స్వల్ప నుంచి మధ్యస్థంగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

Five earthquakes rock Palghar district; no casualty
పాల్​గఢ్​లో ఒకేరోజు 5 భూకంపాలు..

మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌ జిల్లాను సోమవారం భూకంపం వణికించింది. తలాసరీ తాలూకాలోని గ్రామాలను ఉదయం నుంచి రాత్రి వరకు ఐదుసార్లు ప్రకంపనలు కుదిపేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టమేమీ సంభవించలేదని అధికారులు తెలిపారు.

తాజా ప్రకంపనల తీవ్రత రిక్టరు స్కేలుపై 3.4 నుంచి 2.4 మధ్య నమోదైందని చెప్పారు. 2018 నవంబరు నుంచి పాల్‌గఢ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details