మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాల్ని ప్రకటిస్తూ ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ పనిగంటల్లో మాత్రం మరో 45నిమిషాలను అదనంగా చేర్చింది. ఈనెల 29 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ కొత్త విధానంతో ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా.. ఇంధనం, విద్యుత్ ఖర్చులను కూడా తగ్గించొచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.
కొన్నేళ్లుగా 5 రోజుల పనిదినాలను కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకే.. ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేబినెట్ సమావేశంలో ప్రకటించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఫలితంగా 20 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇకపై ప్రతి శనివారం సెలవే...