తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు 'ఫిట్​ ఇండియా' ఉద్యమం ప్రారంభించనున్న మోదీ

దేశ పౌరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ధ్యేయంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'ఫిట్​ ఇండియా ఉద్యమం' ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

By

Published : Aug 29, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 4:43 PM IST

నేడు 'ఫిట్​ ఇండియా' ఉద్యమం ప్రారంభించనున్న మోదీ

దేశ ప్రజలను ఆరోగ్యం వైపు నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుబిగించారు. నేడు హాకీ దిగ్గజం​ ధ్యాన్​చంద్​ జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ మైదానంలో 'ఫిట్​ ఇండియా' ఉద్యమం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల, క్రీడల మంత్రిత్వ శాఖలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. ఆరోగ్య చిట్కాలపై కసరత్తు చేపట్టాయి.

కార్యక్రమంలో భాగంగా 'ఫిట్​నెస్​ లోగో'ను ఆవిష్కరించనున్నారు ప్రధాని. అనంతరం ఫిట్​నెస్​ ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ పాఠశాలల్లో ఈ ప్రతిన చేయాల్సి ఉంటుంది. రోజువారి జీవనంలో శారీరక శ్రమకు సమయం కేటాయించి చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని పొందాలనేది ఈ ఉద్యమ ఉద్దేశం.

ఈ ఉద్యమంలో భారతీయ శాస్త్రీయ, జానపద నృత్యాలను కూడా ప్రోత్సహించనున్నారు. వీటి ద్వారా దేశ సంస్కృతి వ్యాప్తి చెందటమే కాకుండా శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆచితూచి వేయాలి అడుగు..!

Last Updated : Sep 28, 2019, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details