తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చింపాంజీలను జప్తు చేసుకున్న ఈడీ- ఎందుకంటే - వన్యప్రాణులను అక్రమంగా కలిగి ఉన్నాడనే కారణం

ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఓ కేసులో చింపాంజీలను, కోతులను అటాచ్​ చేశారు ఈడీ అధికారులు. అది కూడా మనీ లాండరింగ్​ నిరోధక చట్టం కింద. బంగాల్​లో వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

చింపాజీలను, కోతులను జప్తుచేసిన ఈడీ

By

Published : Sep 21, 2019, 9:04 PM IST

Updated : Oct 1, 2019, 12:27 PM IST

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చరిత్రలోనే తొలిసారిగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చింపాజీలను, కోతులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగాల్‌లో వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్న అధికారులు... కేసు విచారణలో భాగంగా మూడు చింపాంజీలను, 4 కోతులను అటాచ్​ చేశారు.

అక్రమ రావాణా.. ఫోర్జరీ

వన్యప్రాణులను అక్రమంగా కలిగి ఉన్నాడనే కారణంతో సుప్రదీప్​ గూహా అనే స్మగ్లర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణులను అక్రమంగా తరలించే క్రమంలో అటవీశాఖ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశాడని పోలీసులు తెలిపారు.

ఈనేపథ్యంలోనే మనీ లాండరింగ్​ అభియోగాలపై దర్వాప్తు చేపట్టింది ఈడీ. అతని వద్దనున్న చింపాజీలను,కోతులను స్వాధీనం చేసుకుంది. ఒక్కో చింపాంజీ విలువ 25 లక్షలు కాగా.. దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల విలువ ఒక్కొక్కటి.. ఒకటిన్నర లక్షల రూపాయల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న వన్యప్రాణులను కోల్​కతాలోని జంతుప్రదర్శనశాల అధికారులకు అప్పగించారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం

Last Updated : Oct 1, 2019, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details