ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చరిత్రలోనే తొలిసారిగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చింపాజీలను, కోతులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగాల్లో వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్న అధికారులు... కేసు విచారణలో భాగంగా మూడు చింపాంజీలను, 4 కోతులను అటాచ్ చేశారు.
అక్రమ రావాణా.. ఫోర్జరీ
వన్యప్రాణులను అక్రమంగా కలిగి ఉన్నాడనే కారణంతో సుప్రదీప్ గూహా అనే స్మగ్లర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణులను అక్రమంగా తరలించే క్రమంలో అటవీశాఖ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశాడని పోలీసులు తెలిపారు.