తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపాకీతో పిల్లిని బలిగొన్న కిరాతకులు - firing on cat in skihike

కర్ణాటకలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఓ పిల్లిపై కాల్చి చంపారు దుండగులు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

Firing on a cat: owner filed a case in police station in banglore
పిల్లిని కాల్చి చంపిన దుండగులు!

By

Published : Aug 25, 2020, 2:44 PM IST

బెంగళూరులో ఓ పిల్లిని హత్య చేశారు దుండగులు. పిల్లి యజమాని గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు.

అబ్రహాం ఆంటోనీ.. స్థానిక స్కైహైక్ విల్లాస్​లో నివాసముంటున్నాడు. ఓ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి వెనక పెరట్లో రెండు సార్లు కాల్పులు జరిగిన శబ్ధం వినిపించి పరిగెత్తుకెళ్లాడు అబ్రహాం. ఆ తుపాకీ తూటాలు తగిలి, తన పెంపుడు పిల్లి నెత్తుటి మడుగుల్లో పడి ఉండడం చూసి బెంబేలెత్తిపోయాడు. వెంటనే సర్జాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

పిల్లి శరీరంపై తుపాకీ తూటాలు

కేసు నమోదు చేసుకున్న పోలీలుసులు.. పిల్లి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పశువైద్యశాలకు తరలించారు. పిల్లిపై కాల్పులు జరిపిందెవరనే కోణంలో విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి :ఔరా: సుద్దముక్క, పెన్సిల్ నిబ్​పై గణేశుడు

ABOUT THE AUTHOR

...view details