తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూవివాదంతో నడిరోడ్డుపైనే కాల్పులు

భూ తగాదాలు ఎప్పుడూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. కానీ... అదే వివాదం కాల్పుల వరకు వెళ్లింది ఉత్తర్​ప్రదేశ్​లోని ఘజియాబాద్​లో. నడిరోడ్డుపైనే రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు తుపాకులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By

Published : Mar 28, 2019, 12:15 PM IST

భూవివాదంతో నడిరోడ్డుపైనే కాల్పులు

ఉత్తర్​ప్రదేశ్​లోనిఘజియాబాద్​లో కాల్పులు కలకలం రేపాయి. రెండు వర్గాల మధ్య కలహాలు నడిరోడ్డుపైనే కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

భూవివాదంతో నడిరోడ్డుపైనే కాల్పులు

భూ​మి విషయంలో ఘర్షణే కాల్పులకు కారణమని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే వాహబ్​ చౌదరి అనుచరులు మరో వర్గంపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాహబ్ సోదరుడి నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ​త్వరలోనే మరో నిందితుడ్ని పట్టుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details