తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆమ్రపాలి కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేడే - ఆమ్రపాలి కేసు

స్థిరాస్తి​ వ్యాపార సంస్థ ఆమ్రపాలి గ్రూప్​ ఆఫ్​ కంపెనీస్​ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. సుమారు 42 వేల మందికి ఉపశమనం కల్పించేందుకు.. మధ్యలో ఆపేసిన ఇళ్ల నిర్మాణాలను ఎవరు పూర్తి చేయాలనే అంశంపై స్పష్టతనివ్వనుంది.

ఆమ్రపాలి కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేడే

By

Published : Jul 23, 2019, 7:22 AM IST

Updated : Jul 23, 2019, 4:28 PM IST

ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న స్థిరాస్తి​ వ్యాపార సంస్థ ఆమ్రపాలి గ్రూప్​ ఆఫ్​ కంపెనీస్​ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దిల్లీలో ఈ సంస్థ చేపట్టి మధ్యలో ఆపేసిన ఇళ్ల నిర్మాణ పనులను ఎవరు పూర్తి చేస్తారనే దానిపై స్పష్టతనివ్వనుంది. సుమారు 42 వేల మంది బాధితులకు ఉపశమనం కల్పించేలా నిర్ణయం తీసుకోనుంది న్యాయస్థానం. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

ఆమ్రపాలి గ్రూప్​ సంస్థ మధ్యలో నిలిపేసిన పనులను చేపట్టేందుకు తమవద్ద నిధులు లేవని నోయిడా, గ్రేటర్​ నోయిడా అధికార వర్గాలు మే 10న కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో తీర్పును వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

భారీ స్థాయిలో ఇళ్ల కొనుగోలుదారులు, రాజకీయ ఒత్తిడి వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపాయి నోయిడా, గ్రేటర్​ నోయిడా సంస్థలు. ఆమ్రపాలి సంస్థ నుంచి సుమారు రూ.5 వేల కోట్లు బకాయి పడిందని పేర్కొన్నాయి.

ఒకవేళ ఆగిపోయిన ఇళ్లు నిర్మించటంలో ఆమ్రపాలి సంస్థ విఫలమయితే.. ఆ సంస్థకు చెందిన 15 నివాస ఆస్తుల యాజమాన్య హక్కులను నోయిడా, గ్రేటర్ ​నోయిడా సంస్థలకు ఇవ్వనున్నట్లు మే 8న వెల్లడించింది సుప్రీం కోర్టు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై ట్రంప్​ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్​

Last Updated : Jul 23, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details