తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఘటనలో ఎస్ఐ​ మృతి - deen dayal antyodaya bhavan

దిల్లీలోని పండిట్​ దీన్ దయాల్ అంత్యోదయ భవన్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సీఐఎస్​ఎఫ్​ ఎస్​ఐ మృతిచెందారు.

దీన్ దయాల్ అంత్యోదయ భవన్​లో అగ్ని ప్రమాదం

By

Published : Mar 6, 2019, 10:48 AM IST

Updated : Mar 6, 2019, 1:36 PM IST

దిల్లీ సీజీవో కాంప్లెక్స్​లోని దీన్​ దయాల్ అంత్యోదయ భవన్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ సీఐఎస్​ఎఫ్​ ఎస్​ఐ చికిత్స పొందుతూ మరణించాడు.

ఐదవ అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 25 ఫైర్​ ఇంజన్లతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.

దీన్ దయాల్ అంత్యోదయ భవన్​లో అగ్ని ప్రమాదం

మంటలార్పే ప్రయత్నంలో అలముకున్న పొగ కారణంగా సీఐఎస్​ఎఫ్ ఎస్​ఐ​ స్పృహతప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తాగునీరు-పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ , భారత వైమానిక దళ అధికారిక కార్యాలయాలు దీన్​ దయాల్ భవనంలోనే ఉన్నాయి.

Last Updated : Mar 6, 2019, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details