తెలంగాణ

telangana

ప్రధాని ప్రచారాన్ని నిషేధించండి: కాంగ్రెస్​

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కొంతకాలం నిషేధం విధించాలని ఈసీని కాంగ్రెస్​ కోరింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగాల్లో సైన్యాన్ని ప్రస్తావిస్తున్నందుకు ఈ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

By

Published : Apr 23, 2019, 8:26 AM IST

Published : Apr 23, 2019, 8:26 AM IST

Updated : Apr 23, 2019, 10:41 AM IST

ప్రధాని ప్రచారాన్ని నిషేధించండి: కాంగ్రెస్​

ప్రధాని ప్రచారాన్ని నిషేధించండి: కాంగ్రెస్​

ప్రధాని నరేంద్రమోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది కాంగ్రెస్​. సాయుధ దళాలను పదేపదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ మోదీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ నేతలు. ఇందుకు ప్రధాని ప్రచారంపై కొంతకాలం నిషేధం విధించాలని పేర్కొన్నారు.

సీనియర్​ కాంగ్రెస్​ నేతలు కపిల్​ సిబల్​, జైరాం రమేశ్​, అభిషేక్​ మను సింఘ్వీలు ఈసీని సంప్రదించిన వారిలో ఉన్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్​ పైనా ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్​ నాయకులు. ఏప్రిల్​ 18న బెంగళూరులో నిర్మలా ఓటేసిన అనంతరం.. 'అబ్​కీ బార్​ ఫిర్​ మోదీ సర్కార్'​ అంటూ భాజపా నినాదాన్ని పోలింగ్​ బూత్​ వద్ద ప్రస్తావించారని సంబంధిత వీడియోను ఈసీకి అందజేశారు. ఇది కూడా ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు.

మరికొందరిపై...

భోపాల్​ భాజపా అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోన్న సాధ్వి ప్రజ్ఞ సింగ్​ ఠాకుర్​పై తాజాగా ఎఫ్​ఐఆర్​ నమోదైంది. భోపాల్​ ఎన్నికల సంఘం ఆదేశాలతో అక్కడి పోలీసులు చర్య తీసుకున్నారు.

1992 బాబ్రీ ఘటనలో భాగం కావడం తనకు గర్వకారణమన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించింది ఈసీ. టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఇంతకుముందే సంజాయిషీ నోటీసులు జారీ చేసింది ఈసీ.

రాంపుర్​ భాజపా నేత, సినీ నటి జయప్రదపైనా ఫిర్యాదు నమోదైంది. అక్కడి ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Last Updated : Apr 23, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details