తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాడీ బిల్డింగ్​ పోటీల్లో కండల వీరుల మధ్య తీవ్ర ఘర్షణ - బాడీ బిల్డింగ్​ పోటీ వేదకపై కండల వీరల మల్లయుద్ధం

రాజస్థాన్​లో కిసాన్​గఢ్​లో నిర్వహించిన 'మిస్టర్​ హీ మ్యాన్​ ఆఫ్​ అజ్మేర్'​ కండల వీరుల పోటీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విజేతను ప్రకటించిన క్రమంలో.. పోటీదారులు వేదికపైనే ఘర్షణకు దిగారు. ఓ చిన్న పాటి యుద్ధాన్నే తలపించిన ఈ ఘటన అసలెందుకు జరిగింది?

fight while body building competion in ajmer rajastan
బాడీ బిల్డింగ్​ పోటీ వేదకపై కండల వీరల మల్లయుద్ధం

By

Published : Dec 30, 2019, 10:47 AM IST

Updated : Dec 30, 2019, 3:30 PM IST

బాడీ బిల్డింగ్​ పోటీల్లో కండల వీరుల మధ్య తీవ్ర ఘర్షణ

సాధారణంగా పోటీల్లో పాల్గొనేవారంతా ప్రతిభను ప్రదర్శిస్తారు. అయితే అందులో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు. ఓడినవారికి నిరాశ కలగడం సహజమే. వారు మరో సారి ప్రయత్నిద్దామనుకుని సర్దుకుపోతారు. కానీ, రాజస్థాన్​ అజ్మేర్​లోని కొందరు కండల వీరులు మాత్రం విజేతపై పీకల దాకా కోపం పెంచుకున్నారు. వేదికపైనే పిడిగుద్దులు కురిపించారు. వర్గాలుగా చీలిపోయి నానారభస సృష్టించారు.

కిసాన్​గఢ్​లో ఓ సేవా సంఘం నిర్వహించిన 'మిస్టర్​ హీ మ్యాన్​ ఆఫ్​ అజ్మేర్'​ పోటీల్లో విజేతను ప్రకటించగానే మొదలైన ఘర్షణ చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. ఓటమిని భరించలేకనే కొందరు ఇలా హింసకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

"బాడీ బిల్డింగ్​ వేదికపై ఘర్షణ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలంలో అల్లర్లకు పాల్పడుతున్న ముగ్గురిని మేము అరెస్ట్​ చేశాము. పోటీల్లో మార్కింగ్​ పట్ల అసంతృప్తి చెందిన బాడీ బిల్డర్లు విజేతను ప్రకటించగానే ఉద్రేకంతో ఊగిపోయారు. ఆ కోపంలో వారు దాడికి పాల్పడ్డారు. అయితే ఇప్పటి వరకు ఏ వర్గమూ మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేయలేదు."

-రోషన్ లాల్, సీఐ

ఇదీ చదవండి:'పౌర' చట్టానికి వ్యతిరేకంగా రంగవల్లులతో డీఎంకే నిరసన

Last Updated : Dec 30, 2019, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details