తెలంగాణ

telangana

'నిరాహార దీక్ష'తో కేంద్రానికి రైతుల హెచ్చరిక

By

Published : Dec 14, 2020, 5:42 PM IST

దిల్లీ సరిహద్దుల్లో రహదారులపై కూర్చుని దీక్ష చేపట్టిన రైతులు.. కేంద్రానికి బలమైన సందేశాన్ని పంపారు. సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్నదాతలకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు కూడా దీక్షలో కూర్చున్నారు.

farmers-1-day-fast-against-new-farm-laws-ends
'నిరాహార దీక్ష'తో కేంద్రానికి రైతుల వార్నింగ్​

ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టి.. కేంద్రానికి గట్టి సందేశాన్ని పంపారు అన్నదాతలు. దిల్లీ సరిహద్దుల్లో రహదారులపైనే కూర్చిని దీక్ష చేసి.. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం దిగిరావాల్సిందేనని తేల్చిచెప్పారు. అప్పటివరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

నిరాహార దీక్ష విజయవంతం
సింఘూ సరిహద్దులో రైతులు

టిక్రీ, ఘాజీపుర్​ సహా పలుచోట్ల దీక్షలు చేపట్టారు అన్నదాతలు. రైతులకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు కూడా దీక్షలో కూర్చున్నారు. దీక్ష ముగిసిన అనంతరం మంచినీరు, పళ్లు తీసుకున్నారు.

దీక్ష విరమించి.. పళ్లు సేవిస్తూ
దీక్షలో రైతుల కుటుంబసభ్యలు

రైతుల నిరాహార దీక్షకు రాజకీయ పార్టీలు, పలు సంఘాల సంఘీభావం తెలిపాయి. ఆప్‌తో పాటు ఎస్పీ, అకాలీదళ్‌ నేతలు ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details