తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో బంద్​ నిర్వహిస్తున్నాయి రైతు సంఘాలు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెపడుతున్నాయి. బైక్​ ర్యాలీలు నిర్వహించాయి. పలు చోట్ల బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళనలకు దిగాయి.

By

Published : Sep 28, 2020, 10:33 AM IST

Farmers' orgs have called karnataka  statewide bandh against Farm Bills
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, భూ సంస్కరణల ఆర్డినెస్స్, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) సవరణలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. అఖిల భారత కిసాన్​ సభ(ఏఐకేఎస్​) సహా ఇతర సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. రోడ్లపై ఆందోళనలు నిర్వహించాయి.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు
నిరసన తెలుపుతున్న రైతులు
నిరసనల్లో భాగంగా బైక్​ ర్యాలీ
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు

ఆందోళనలలో భాగంగా బైక్ ర్యాలీలు నిర్వహించాయి రైతు సంఘాలు. పలు చోట్లు రోడ్లపై బైఠాయించి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు తెరిచిన యజమానుల వద్దకు వెళ్లి బంద్​కు మద్దతు తెలుపాలని కోరారు.

రాస్తారోకో..
కర్ణాటకలో ఆందోళనలు
మూతపడ్డ దుకాణాలు
బంద్​కు మద్దతు తెలపాలని దుకాణ యజమానికి పూలు ఇస్తున్న రైతులు

రాష్ట్ర బంద్ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ముందు జాగ్రత చర్యలు తీసుకున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
పోలీసుల బందోబస్త్​

ABOUT THE AUTHOR

...view details