తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2020, 12:26 PM IST

Updated : Mar 3, 2020, 12:34 PM IST

ETV Bharat / bharat

'సజీవ సమాధి'తో రాజధాని రైతులు నిరసన

భూసేకరణకు వ్యతిరేకంగా రాజస్థాన్​ జైపుర్​ రైతులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మెడలోతు వరకు శరీరాలను పాతిపెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. భూసేకరణ సవరణ చట్టం ప్రకారం తగిన పరిహారం అందించాలంటూ నినాదాలు చేస్తున్నారు.

farmers
'సజీవ సమాధి' చేసుకున్న 21మంది రాజధాని రైతులు

భూసేకరణ సవరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలని రాజస్థాన్​ జైపుర్​ జిల్లా నిందర్​లో 21 మంది రైతులు తమ శరీరాలను మెడవరకు పాతిపెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆదివారం నుంచి ఇదే విధంగా ఆందోళన చేస్తున్నారు.

రైతుల భూముల్లో గృహ నిర్మాణ పథకం చేపట్టడం కోసం 13వందల బీగాల భూమిని జైపుర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ(జేడీఏ) సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో సరైన పరిహారం కోసం ఉద్యమిస్తున్నారు నిర్వాసితులు. గత జనవరిలోనూ నాలుగు రోజులపాటు ఇదే విధంగా నిరసన వ్యక్తం చేశారు.

'సజీవ సమాధి' చేసుకున్న 21మంది రాజధాని రైతులు

"నూతన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వాలి. దీని ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది. చట్టానికి అనుగుణంగా పరిహారం ఇస్తే సంతోషంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రభుత్వ వర్గాలే మమ్మల్ని సంప్రదించాలి."

-కైలాశ్ బోరా, నిందర్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు

ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా 2017 అక్టోబర్ నుంచి ఆందోళనలు చేపడుతున్నారు రైతులు. ఇప్పటికే 600 బీగాలను స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. ఇందుకు పరిహారంగా రూ. 60 కోట్లను స్థానిక కోర్టుకు సమర్పించింది. అయితే ఈ మొత్తాన్ని తిరస్కరించారు రైతులు. భూసేకరణ సవరణ చట్టానికి అనుగుణంగా మాత్రమే పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:'సజీవ సమాధి'తో రాజధాని రైతుల నిరసన

Last Updated : Mar 3, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details