తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేడ తెచ్చి పోసి.. భాజపా నేత ఇంటి ముందు ఆందోళన - BJP leader Tikshan Sood

పంజాబ్​లో ఓ భాజపా నేత ఇంటి ముందు నిరసన చేపట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. హోసియార్​పుర్​లోని ఆయన ఇంటి ముందు పేడ తెచ్చి పోసి.. సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Farmers anger erupted over BJP leader in punjab tikshan sood
పేడ తెచ్చి పోసి.. భాజపా నేత ఇంటి ముందు ఆందోళన

By

Published : Jan 2, 2021, 5:29 AM IST

పంజాబ్​లోని హోసియార్​పుర్​లో భారతీయ జనతా పార్టీ నేత, పంజాబ్​ మాజీ మంత్రి తీక్షణ్​ సూద్​ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ట్రక్కులో పేడను తీసుకొచ్చి ఇంటి ముందు పారబోశారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పేడ తెచ్చి పోసి.. భాజపా నేత ఇంటి ముందు ఆందోళన

అనంతరం.. భాజపా కార్యకర్తలు తీక్షణ్​ సూద్​ ఆధ్వర్యంలో హోసియార్​పుర్​లోని జోదామల్​ రహదారిపై ధర్నాకు దిగారు. అల్లరి మూకలే ఇలా చేశాయని, బాధ్యుల్ని గుర్తించి తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.

సీఎం స్పందన..

మాజీ మంత్రి ఇంటి ముందు జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ స్పందించారు. వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ఇలాంటి ఘటనలు.. రైతుల శాంతియుత ఆందోళనకు కూడా చెడ్డపేరు తెస్తాయన్నారు. రైతులకు మద్దతు పేరిట ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:'చర్చల్లో పురోగతి లేకుంటే 6న ట్రాక్టర్​ ర్యాలీ'

ABOUT THE AUTHOR

...view details