తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ వార్తలు అసత్యం- అమిత్ షా ట్వీట్ ఫేక్​'

జమ్ము కశ్మీర్, లద్దాఖ్​ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్జాలాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంమంత్రి అమిత్ షా పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ట్వీట్ ఫేక్​ అని తేల్చిచెప్పింది.

By

Published : Jun 30, 2020, 12:29 PM IST

FAKE alert: No, Amit Shah didn't say internet will be snapped in JK, Ladakh
ఆ వార్తలన్నీ అబద్ధం- అమిత్ షా ట్వీట్ ఫేక్​

కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్​లను నిషేధించిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లలో అంతర్జాలాన్ని నిలిపివేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ వదంతులేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

ఈ విషయంపై అమిత్ షా పేరుతో తప్పుడు ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నట్లు హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫిక్స్​డ్ లైన్, బ్రాడ్​బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అందులో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ట్వీట్ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

"ఈ ట్వీట్ ఫేక్. కేంద్ర హోంమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అలాంటి ట్వీట్ చేయలేదు."

-కేంద్ర హోంశాఖ ప్రతినిధి

2జీ అందుబాటులోనే

జులై 8 వరకు హైస్పీడ్ ఇంటర్నెట్​పై నిషేధం విధిస్తూ జమ్ము కశ్మీర్ యంత్రాంగం జూన్ 17న నిర్ణయం తీసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి చొరబడే ఉగ్రవాదులకు ఇక్కడి నుంచి సమాచారం అందకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అయితే.. పోస్ట్​-పెయిడ్, ఫిక్స్​డ్ లైన్ చందాదారులకు 2జీ స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోనే ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి-సరిహద్దు ఘర్షణలపై భారత్​-చైనా మరోసారి భేటీ

ABOUT THE AUTHOR

...view details