తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2019, 5:36 PM IST

Updated : Sep 28, 2019, 8:30 AM IST

ETV Bharat / bharat

ఫేస్​బుక్ ప్రేమ:​ ఒక్కటైన జపాన్ వధువు, తమిళ వరుడు

సామాజిక మాధ్యమాల దిగ్గజం ఫేస్​బుక్​ మరో ప్రేమ జంటను ఒక్కటి చేసింది. జపాన్​కు చెందిన అమ్మాయికి, భారత్​కు చెందిన అబ్బాయితో మొదట చాటింగ్​లో మాటల కలిశాయి. ఆ తర్వాత మీటింగ్​లో మనసులు కలిసిన ఈ ప్రేమ జంట.. పెద్దల అంగీకారంతో సంప్రదాయబద్దంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది.

ఫేస్​బుక్​ ఒక్కటి చేసిన 'జపాన్​-భారత్​ ప్రేమ జంట'

ఫేస్​బుక్​ ఒక్కటి చేసిన 'జపాన్​-భారత్​ ప్రేమ జంట'
ఖండాలు, దేశాలు దాటి నడిచే ప్రేమకు సర్వసాధారణ వేదికైన ఫేస్​బుక్​.. మరో ప్రేమ జంటను కలిపింది. ఫలితంగా జపాన్​ ఆడపడచు భారత కోడలైంది. ఆగస్టు 25న తమిళనాడు కుంభకోణంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంటను ఇరువురి పెద్దలు ఆశీర్వదించారు. వీరి ప్రేమ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. మెకుమీ-వసంతన్​ల ప్రేమ జంట.. దేశాంతర వివాహం వరకు ఎలా నడిచిందో చూద్దాం.

తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణానికి చెందిన వసంతన్​ పీహెచ్​డీ పూర్తి చేయడానికి ఏడేళ్ల క్రితం జపాన్​కు వెళ్లాడు. చదువు పూర్తి చేసి అక్కడే శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించాడు. ఆ సమయంలోనే న్యాయవాది​ మెకుమీతో పరిచయం ఏర్పడింది. ఫేస్​బుక్​లో వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకుని.. పెద్దలను ఒప్పించారు. మెకుమీ కోరిక మేరకు హిందూ సంప్రదాయంలో మూడుముళ్లు వేశాడు వసంతన్​.

ఇరు కుటుంబాల పెద్దలు ఈ నూతన వధూవరులను దీవించారు. కొన్ని పరిస్థితుల కారణంగా మెకుమీ తల్లిదండ్రులు పెళ్లికి హాజరుకాలేకపోయారు. ఆమె మేనమామ బాధ్యతలు స్వీకరించి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. జపాన్​ పెళ్లికూతురు భారత కట్టుబొట్టులో బుట్టబొమ్మలా మురిసిపోయింది. ఇక మెకుమీ బంధువులు సైతం హిందూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిశారు.

"నా పేరు మెకుమీ.. నమస్కారం. సంప్రదాయ వివాహం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళ వివాహంలో ఇలా అందమైన చీర, నగలు ధరించడం నాకు చాలా నచ్చింది. భారత కుటుంబాలు, స్నేహితుల మధ్య దృఢమైన బంధాలు ఉంటాయని నాకు స్పష్టంగా అర్థమైంది. "
-మెకుమీ

ఇదీ చూడండి:కుటుంబాన్ని కోల్పోయినా... మిత్రుడ్ని కాపాడాడు

Last Updated : Sep 28, 2019, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details