తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏ... మరో దేశ విభజన లాంటిదే: స్వర భాస్కర్ - యూపీ పోలీసుల తీరు సిగ్గుచేటు

పౌరసత్వ చట్ట సవరణను.... దేశ విభజనకు జరుగుతున్న మరో ప్రయత్నంగా అభివర్ణించారు బాలీవుడ్ నటి స్వర భాస్కర్. సీఏఏ, ఎన్​ఆర్​సీ విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. యూపీలో అల్లర్లు, షహీన్​ బాగ్​ నిరసనలు సహా వేర్వేరు అంశాలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు స్వర.

Exclusive Interview with Swara Bhaskar
యూపీ పోలీసుల తీరు సిగ్గుచేటు

By

Published : Jan 29, 2020, 2:31 PM IST

Updated : Feb 28, 2020, 9:52 AM IST

స్వర భాస్కర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

సీఏఏపై మీ అభిప్రాయం..
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. సీఏఏతోపాటు ఎన్​ఆర్సీని కేంద్రం తీసుకురావలనుకోవడం నా మనస్సును బాధించింది. ప్రజలను నాయకులు విద్వేషం వైపు ప్రోత్సహిస్తున్నారు. సీఏఏతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు.

యూపీలో పోలీసుల తీరుపై..

ఉత్తరప్రదేశ్​లో పోలీసులు నిరసనకారలు పట్ల దారుణంగా వ్యవహరించారు. వారి చర్యలు సిగ్గు చేటు. వీడియోలు చూస్తే ఎవరు ఘర్షణకు దిగారో అర్థం అవుతుంది. యూపీ ప్రభుత్వమే ఆ దాడులకు బాధ్యత వహించాలి.

షహీన్​ బాగ్​లో జరిగేది నిజమైన ఆందోళనేనా?

షహీన్ ​బాగ్​లో మహిళలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఒక్క ముస్లింలు మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారు వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

సీఏఏపై అంతర్జాతీయ ఒత్తిడి..

సీఏఏకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది. ఈయూలో సీఏఏపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నా. దేశంలో ఇంత ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గడం లేదో అర్థం కావడం లేదు.

షార్జీల్ ఇమామ్ ప్రకటనపై..

జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్ చేసిన ప్రకటన సరికాదు. భారత్​ ఐక్యతపై ఎలాంటి సందేహం లేదు. భారతీయులందరం కలిసుండాలి.

Last Updated : Feb 28, 2020, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details