తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అలా మాట్లాడితే నిజం చెప్పినా ఎవరూ నమ్మరు' - నావికా దళం

దివంగత ప్రధాని రాజీవ్​ గాంధీ ఐఎన్​ఎస్​ విరాట్​ను ట్యాక్సీలా ఉపయోగించారన్న మోదీ వ్యాఖ్యలు అసత్యమని మాజీ నేవీ అధికారి ఐ.సీ. రావు తెలిపారు. రాజకీయ లబ్ధికోసం ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారాయన.

'అలా మాట్లాడితే నిజం చెప్పినా ఎవరూ నమ్మరు'

By

Published : May 9, 2019, 10:19 PM IST

ఐఎన్​ఎస్​ విరాట్​ను రాజీవ్​ గాంధీ ట్యాక్సీలా వాడారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపణలను మాజీ నేవీ అధికారి ఐ.సీ రావు​ ఖండించారు. మోదీ వ్యాఖ్యలు అసత్యమని విశ్రాంత వైస్​ అడ్మైరల్​ రావు తెలిపారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... నిజం చెప్పినా ప్రజలు నమ్మరని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇలాంటి ఆరోపణల వల్ల మోదీ లాంటి వ్యక్తులు నిజాలు చెప్పినా అవి అబద్ధాల్లాగే కనపడతాయి. ఓట్ల కోసం రాజకీయ నేతలు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతో బాధాకరం. ప్రజలు ఇలాంటి ఆరోపణలను పట్టించుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.'
- ఐ.సీ రావు, మాజీ నేవీ అధికారి.

1987 సమయంలో పది రోజుల పాటు లక్షద్వీప్​లో బంధువులు, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లినప్పుడు రాజీవ్ ఐఎన్​ఎస్​ విరాట్​ను ట్యాక్సీలా వాడారని ప్రధాని మోదీ ఆరోపించారు. తాను మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీకి అభిమానిని కాదని స్పష్టం చేసిన రావు... నావికా దళం సహా ఇతర వ్యవస్థలను రాజకీయ లబ్ధికోసం ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

1987లో ముంబయి నావికా ​యార్డ్​లో రావు ఆడ్మైరల్​ సూపరిండెంట్​ బాధ్యతలు నిర్వర్తించారు. ఆనాటి పరిస్థితులను మాజీ నేవీ అధికారి వివరించారు.

" తిరువనంతపురంలో రాజీవ్​గాంధీ కుటుంబసమేతంగా నౌకలో ఎక్కారు. అక్కడి నుంచి లక్షద్వీప్​ 220 నాటికల్​ మైళ్ల దూరం. అక్కడికి చేరుకోవాలంటే హెలికాప్టర్​ ఒక్కటే మార్గం. అందుకే విరాట్​ నుంచి విమాన సేవలు వినియోగించుకున్నారు. నౌక సిబ్బందితో ఎంతో సరదాగా గడిపారు. వారికి భోజన వసతులూ ఏర్పాటు చేశారు రాజీవ్​. అలాంటి వ్యక్తిపై కేవలం రాజకీయ లబ్ధికోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు."
- ఐ.సీ రావు, మాజీ నేవీ అధికారి.

ఇదీ చూడండి:'నిరూపించకుంటే మోదీ వంద గుంజీలు తీయాలి'

ABOUT THE AUTHOR

...view details